Sachivayalaya 'vacancies 25 thousand .. merit list .. notification?
APGS Merit List: 'సచివాలయ' ఖాళీలు 25 వేలు.. మెరిట్ లిస్టా.. నోటిఫికేషనా?
జనవరిలో నోటిఫికేషన్లు విడుదల చేయొచ్చు అంటున్న అధికారులు.
ఏపీలో అక్టోబరు 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా సచివాలయాల్లోని మొత్తం 1.26 లక్షల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 21 లక్షల మంది అభ్యర్థులకు ప్రభుత్వం సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో అర్హత సాధించి.. తుది జాబితాలకు ఎంపికైన 1.01 లక్షల మంది అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన నిర్వహించి.. వారికి నియామక పత్రాలు కూడా అందజేసింది.
ఆరు విభాగాల్లో మొత్తం 39,176 పోస్టులకుగానూ 18,217 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. మిగతా 20,959 పోస్టులు ఖాళీగానే మిగిలాయి. అర్హత మార్కులను తగ్గించడం ద్వారా మిగతా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తే.. మరింత మంది అభ్యర్థులు ప్రయోజనం పొందుతారు. వీటితోపాటు మిగతా ఉద్యోగాలకు అర్హత సాధించి నియామకపత్రాలు అందుకోనివారితో కలిపి మొత్తం 25 వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి.
జనవరిలో నోటిఫిషన్?
గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిపోయిన పోస్టల భర్తీకి సంబంధించి నిరుద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎంపిక జాబితాలో అర్హత మార్కులు తగ్గించి మిగతా పోస్టులను భర్తీ చేస్తారా? లేదా మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఏటా జనవరిలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. ఈ ఖాళీల భర్తీకి కూడా జనవరిలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని అధికారవర్గాలు అంటున్నాయి.
ప్రధానాంశాలు:
మిగిలిన ఖాళీలపై ఎటూ తేల్చని ప్రభుత్వంజనవరిలో నోటిఫికేషన్లు విడుదల చేయొచ్చు అంటున్న అధికారులు.
ఏపీలో అక్టోబరు 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా సచివాలయాల్లోని మొత్తం 1.26 లక్షల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 21 లక్షల మంది అభ్యర్థులకు ప్రభుత్వం సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో అర్హత సాధించి.. తుది జాబితాలకు ఎంపికైన 1.01 లక్షల మంది అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన నిర్వహించి.. వారికి నియామక పత్రాలు కూడా అందజేసింది.
ఆరు విభాగాల్లో మొత్తం 39,176 పోస్టులకుగానూ 18,217 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. మిగతా 20,959 పోస్టులు ఖాళీగానే మిగిలాయి. అర్హత మార్కులను తగ్గించడం ద్వారా మిగతా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తే.. మరింత మంది అభ్యర్థులు ప్రయోజనం పొందుతారు. వీటితోపాటు మిగతా ఉద్యోగాలకు అర్హత సాధించి నియామకపత్రాలు అందుకోనివారితో కలిపి మొత్తం 25 వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి.
జనవరిలో నోటిఫిషన్?
గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిపోయిన పోస్టల భర్తీకి సంబంధించి నిరుద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎంపిక జాబితాలో అర్హత మార్కులు తగ్గించి మిగతా పోస్టులను భర్తీ చేస్తారా? లేదా మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఏటా జనవరిలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. ఈ ఖాళీల భర్తీకి కూడా జనవరిలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని అధికారవర్గాలు అంటున్నాయి.
మిగిలిపోయిన ఖాళీల వివరాలు ఇలా..
జిల్లా మొత్తం భర్తీ అయిన మిగిలిన
పోస్టులు. పోస్టులు. పోస్టులు
శ్రీకాకుళం 7,884 6019 1865
విజయనగరం 6,567 4903 1664
విశాఖపట్నం 10,872 8565 2307
తూ గోదావరి 13,057 10,363 2,694
ప గోదావరి 9,576 7,564 2,012
కృష్ణా 11,025 9,059 1,966
గుంటూరు 11,279 9,715 1,564
ప్రకాశం 7,814 5,903 1,911
నెల్లూరు 9,109 8,885 224
చిత్తూరు 11,629 8,245 3,384
కడప 10,285 8,127 2,158
అనంతపురం 9,597 7,658 1,939
కర్నూలు 8,034 6,435 1,599
మొత్తం 1,26,728 1,01,441 25,287
0 Response to "Sachivayalaya 'vacancies 25 thousand .. merit list .. notification?"
Post a Comment