- పరీక్ష నెగ్గితే . . పదోన్నతి
- ఉద్యోగులకు శాఖాపర పదోన్నతులు
- నవంబరు 14 నుంచి ఆన్లైన్లో పరీక్షలు
- ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ ) ఏటా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తుంది .
- 2019 ఫిబ్రవరిలో మొదటిదశ పరీక్షలు జరిగాయి . ఇప్పుడు నవంబరు 14 నుంచి 19 వరకు వరుసగా ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరుగబోతున్నాయి .
- ఉద్యోగులు , ఉపాధ్యాయులు పదో న్నతులు కావాలంటే ఈ పరీక్షలు తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది .
- మూడుసార్లు వరకు పరీక్ష రాసేవారికి ఆన్ డ్యూటీగా పరిగణిస్తారు .
- అయితే టీఏ , డీఏ ఇవ్వరు .
వంద మార్కులకు పరీక్ష.
- ఒక్కో విభాగం నుంచి వంద మార్కులకు పరీక్ష ఉంటుంది .
- ఒకోం . విభాగానికి సంబంధించి 10 నుంచి 12 ప్రశ్నలు ఉంటాయి .
- ప్రధా నంగా రాజ్యాంగం , పెన్షన్ నియమ నిబంధనలు , సెలవులు , పదోన్న తులు , క్రమశిక్షణా చర్యలు , ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ ( ఫైనాన్స్ మేనేజ్మెంట్ ట్రెజరీ రూల్స్ వేతన స్థిరీకరణ ( పీఆర్సీ ) ఇంక్రీ మెంట్లు , బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలపై ప్రశ్నలు ఇస్తారు .
- పదోన్నతుల పరీక్షల్లో పెన్షన్ నియమ నిబంధనలకు సంబంధించి 20 ప్రశ్నలు , మన రాజ్యాంగానికి సంబంధించి 10 ప్రశ్నలు , సెల వుల నిబంధనలపై 10 , ఆర్థిక నియమావళి ( పైనాన్స్ మేనేజ్ మెంట్ ) పై 10 , ట్రెజరీ నిబంధనలపై 10 - 15 మార్కులు , శాఖాపరమైన బడ్జెట్మాన్యువల్ పై 10 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి .
- ఈ ఉద్యోగులకు విధించే క్రమశిక్షణ చర్యలు , రికవరీల రకాలు తదితర అంశాలపై పది మార్కులు . .
- ఇటీవల కాలంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగులకు సంబంధించిన జీవోల నంబర్లు , తేదీలు , శాఖాపరమైన వివరాలపై 10నుంచి 15 మార్కులు ఉంటాయి .
- ఈ ఉద్యోగుల టీఏ , డీఏలు , ట్రాన్స్ఫర్ నియమనిబంధనలు , వీటికి సం బంధించిన రేట్లు , అర్హతలు , దానిలో ఉండే గ్రేడ్లు తదితర అంశాలపై పది మార్కులు ఉంటాయి .
- ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే రుణాలు తాత్కాలిక , శాశ్వత ఇంటి నిర్మాణాలు , మోటారు వాహనాలు , కార్లు , కంప్యూటర్లు , ఇళ్ళస్థలాల కొనుగోలు , ఇంటి రుణాలు , ఏ ఉద్యోగికి ఎంత అర్హత అనే అంశాలపై పది మార్కులు ఉంటాయి
నెగిటివ్ మార్కులతో జాగ్రత్త
ప్రధానంగా ఉద్యోగుల పదోన్నతుల పరీక్షలు ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి . దీనికి నెగిటివ్ మార్కులు ప్రవేశపెట్టారు . ఒక ప్రశ్న తప్పు అయితే 0 . 25 మార్కులు కోతవేస్తారు . దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు పరీక్షలను ఆషామాషీగా చూడొద్దు . జవాబులు తెలిస్తేనే అటెంప్ట్ చేయాలి . లేకపోతే వదిలివేయాలి .
పదోన్నతులు మూడు రకాలు :
- ఎవరైనా ఉద్యోగి , ఉపాధ్యాయుడు , అధికారి అకౌంట్స్ టెస్టులు 1 , 2 , ఈవోటెతో పాటు ఆయాశాఖల్లో ఉండే ప్రత్యేక పరీక్షలు పాస్ కావాలి .
- అప్పుడే పదోన్నతులు స్పెషల్ గ్రేడ్ వేతనాలు పొందుతారు
- ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే అర్హత ఉంటుంది .
మినహాయింపులు :
- • ఒక ఉద్యోగి ఏ పోస్టులోనైనా మొదటిసారి విధుల్లోకి చేరిన తర్వాత ఆ ఉద్యోగి వయసు 45 ఏళ్ళు నిండితే శాఖా పరమైన పరీక్షల నుంచి మినహా యింపు ఇచ్చి పదోన్నతి ఇస్తారు .
- ఇటు వంటి అవకాశం ఆ ఉద్యోగి సర్వీసులో ఒక్కసారి మాత్రమే ఇస్తారు .
- ఇది కూడా మొదటి పదోన్నతికి మాత్రమే వర్తిస్తుంది . తర్వాత ఇది అమలుకాదు .
- ఇప్పటికే ఈ అవకా శాన్ని ఉపయోగించుకున్నా , ఉపయో గించుకోకపోయినా ఒక పదోన్నతి పొంది రెండో పదోన్నతికి ఖచ్చితంగా శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిందే .
ఆన్లైన్ లోనే పరీక్షలు
- ఉద్యోగుల పదోన్నతుల పరీక్షలు పూర్తిగా ఆన్లై లో ఉంటాయి .
- 9 - 12 గంటల మధ్య , తిరిగి మధ్యాహ్నం 2 - 5 గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తారు .
- ప్రశ్నాప త్రంతో ఆన్సర్ షీటును వెంటనే ఇస్తారు .
- ఈ పరీక్ష పూర్తయిన వారంలో విడుదల చేస్తారు .
- దీనిని పరిశీలించి ఏదైనా అనుమానం ఉంటే ఏపీపీఎస్సీ కమిషన్కు 15 రోజులలోపు ఫిర్యాదు చేయాలి .
- ఫిర్యాదు చేసిన అభ్యర్థి యొక్క అభ్యంతరం సరైనదైతే దీనికి మార్కులు
0 Response to "If you pass the test you will get promotion"
Post a Comment