NEET are must for AIIMS and ZIPMERS
ఎయిమ్స్, జిప్మెర్లకూ ‘నీట్’ తప్పనిసరి
వైద్య విద్యా రంగంలో మరిన్ని మార్పులు తీసుకొనే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని వైద్య విద్యా సంస్థ ల్లో ఒకే విధానం అమల్లో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ఇకపై ఎయిమ్స్, జిప్మెర్ సంస్థల్లో ఎంబీబీఎస్ ప్రవేశానికి ‘నీట్’ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకొంది. ఇంతవరకు ఎయిమ్స్, జిప్మెర్ (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) మినహా ఇతర వైద్య కళాశాలలు అన్నింటిలో ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ‘నీట్’ రాయాల్సి వచ్చేది.
కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు 2020 విద్యా సంవత్సరం నుంచి ఎయి మ్స్, జిప్మెర్ సంస్థల్లో ప్రవేశానికి కూడా విద్యార్థులు ‘నీట్’లో అర్హత సాధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ శుక్రవారం ప్రకటించారు. వైద్య విద్యా కోర్సుల్లో ఉమ్మడి విధానం ఉండాలన్న లక్ష్యంతోనే ‘నీట్’ను ఎయిమ్స్, జిప్మెర్లకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకొన్నట్లు మంత్రి తెలిపారు. వైద్య విద్యా రంగంలో ఒకే విధమైన ప్రమాణాలు ఉండడానికి వీలు పడుతుందని మంత్రి వివరించారు. ఎంబీబీఎస్ కౌనె్సలింగ్ ప్రక్రియతో పాటు ఫైనల్ ఇయర్ పరీక్షలు జాతీయ వైద్య కమిషన్ చట్టం 2019 ప్రకారం.. జాతీయ ప్రాధాన్యం కలిగిన ఎయిమ్స్ కు ఒకే విధంగా ఉన్నాయి. ఎయిమ్స్, జిప్మెర్లు మాత్రం ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను ఆయా సంస్థలు సొంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
వైద్య విద్యా రంగంలో మరిన్ని మార్పులు తీసుకొనే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని వైద్య విద్యా సంస్థ ల్లో ఒకే విధానం అమల్లో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ఇకపై ఎయిమ్స్, జిప్మెర్ సంస్థల్లో ఎంబీబీఎస్ ప్రవేశానికి ‘నీట్’ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకొంది. ఇంతవరకు ఎయిమ్స్, జిప్మెర్ (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) మినహా ఇతర వైద్య కళాశాలలు అన్నింటిలో ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ‘నీట్’ రాయాల్సి వచ్చేది.
కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు 2020 విద్యా సంవత్సరం నుంచి ఎయి మ్స్, జిప్మెర్ సంస్థల్లో ప్రవేశానికి కూడా విద్యార్థులు ‘నీట్’లో అర్హత సాధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ శుక్రవారం ప్రకటించారు. వైద్య విద్యా కోర్సుల్లో ఉమ్మడి విధానం ఉండాలన్న లక్ష్యంతోనే ‘నీట్’ను ఎయిమ్స్, జిప్మెర్లకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకొన్నట్లు మంత్రి తెలిపారు. వైద్య విద్యా రంగంలో ఒకే విధమైన ప్రమాణాలు ఉండడానికి వీలు పడుతుందని మంత్రి వివరించారు. ఎంబీబీఎస్ కౌనె్సలింగ్ ప్రక్రియతో పాటు ఫైనల్ ఇయర్ పరీక్షలు జాతీయ వైద్య కమిషన్ చట్టం 2019 ప్రకారం.. జాతీయ ప్రాధాన్యం కలిగిన ఎయిమ్స్ కు ఒకే విధంగా ఉన్నాయి. ఎయిమ్స్, జిప్మెర్లు మాత్రం ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను ఆయా సంస్థలు సొంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
0 Response to "NEET are must for AIIMS and ZIPMERS"
Post a Comment