You come to our school.Also we Come to your school.
- మీరు మా బడికి రండి . . మేమూ మీ బడికొస్తాం .
- విద్యాశాఖలో సరికొత్త కార్యక్రమం .
- ఒక పాఠశాల విద్యార్థులు మరో పాఠశాల సందర్శన వారం రోజులు వేరే స్కూల్లో చదువులు.
- జిల్లాలో 876 పాఠశాలల ఎంపిక ఒక్కో పాఠశాలకు , రూ . 1000 మంజూరు.
- కార్యాచరణ సిద్ధం చేసిన విద్యాశాఖాధికారులు
- సంప్రదాయాలకు ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది .
సమస్యకు మూలాలను వెతికి , అక్కడనే మార్పుకు బీజాలను వేస్తోంది . విలువలతో కూడిన విద్యను అందరికీ అందించినప్పుడే సమా జాభివృద్ధి సాధ్యమని మహాత్ముడు కన్న కల లను సాకారం చేసేలా సరికొత్త కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది . విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రక టిస్తే , అది సాధ్యమేనా అని సంశయం వ్యక్తం చేసిన విద్యారంగ నిపుణులు సైతం తాజా నిర్ణ యాలకు ఫిదా అవుతున్నారు . విద్యాశాఖ చరిత్రలో తొలిసారిగా ' పాఠశాలల కలయిక ' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు .
ప్రభుత్వ ఆదేశాలతో సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఓడ్రేవు చిన వీరభద్రుడు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు . ప్రభుత్వ , ప్రైవేటు , ఎయిడెడ్ పాఠశా లను అనుసంధానం చేస్తూ నగర , పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పరస్పరం కలుసుకొని చర్చించుకోవటం ద్వారా విద్యార్థి దశలోనే మేధోమథనం జరిగేలా కార్యక్రమం రూపకల్పన చేశారు . ఇతర పాఠశాలల్లో ఏం జరుగుతుందనే పరిశీలన చేయటం ద్వారా విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన , మేధోమ ధనం , భావ వ్యక్తీకరణ పాంపొందించటం దీని ప్రధాన లక్ష్యం .
అనుబంధాల కలయిక
గ్రామీణ ప్రాంతంలోని ఒక పాఠశాల విద్యార్థు | లంతా సమీప పట్టణం లేదా కొంతమేర అలి వృద్ధి చెందిన పాఠశాలను సందర్శిస్తారు . ఇదే రీతిన పట్టణ ప్రాంత పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలను సంద ర్శిస్తారు . 6 నుంచి 18 సంవత్సరాల వయస్సుఉండి 1 నుంచి 8వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వామ్యు లను చేయాలి . వారం రోజులపాటు అదే పాఠ శాల విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేసి , ఆటపాటలతో చదువులు సాగిస్తారు . ఇందుకోసమని జిల్లాలో 876 ( 438 జతలు పాఠశాలలను ఎంపిక చేశారు . దీనిని ఈ నెల మూడో వారంలో అమలు చేసేందుకు విద్యాశాఖాధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు . రవాణా ఖర్చులు , ఇతర అవసరాల కోసమని ఒక్కో పాఠశాలకు రూ . 1000లు చొప్పున ప్రత్యేకంగా నిధులు విడు దల చేశారు . అవసరమైన పక్షంలో పాఠశాల లో అందుబాటులో ఉన్న నిధులు సైతం దీని కోసమని వినియోగించుకోవచ్చు . . .
ఆతిథ్యమివ్వనున్న పేరెంట్స్ కమిటీలు
మన ఇంటికి చుట్టాలు లేదా స్నేహితులు వస్తే అనుబంధం బలపడేలా ఏ రీతిన మర్యాదలు చేస్తామో అదే రీతిన పాఠశాల లకు వచ్చే విద్యార్థులకు తగిన సౌకర్యాలు
కల్పించేలా పేరెంట్స్ కమిటీ బాధ్యత తీసు కోవాలని ప్రభుత్వం సూచించింది . వసతి , తాగునీరు , భోజనం , అవసరమైతే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి , కార్య క్రమం సానుకూలంగా నిర్వహించేలా చూడాలి . ఆతిధ్యమిచ్చే పాఠశాల , విద్యార్థు లు , ఉపాధ్యాయులు సాధించిన విజయాలు , అందుకు చేసిన కృషిని , వారి మార్గ నిర్దేశా లను వివరించటం ద్వారా విద్యార్థుల అభ్యు న్నతికి దోహదపడే కార్యక్రమాలకు ప్రాధా న్యత ఇవ్వాలి .
జిల్లా స్థాయిలో పర్యవేక్షణ
విద్యార్థి దశలోనే స్నేహ బంధం , అను బంధాల ప్రాముఖ్యతను చాటిచెబుతూ , సత్ప్రవర్తనతో చదువులు సాగించేలా ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా దీనిని అమలు చేస్తోంది . దీనిని విజయవంతం చేసేందుకు జిల్లా స్థాయి విద్యాశాఖాధికారులు ఎప్పటిక ప్పుడు పర్యవేక్షణ చేయాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . మండల , జిల్లా , రాష్ట్ర స్థాయి కమిటీలు ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తాయి .
0 Response to "You come to our school.Also we Come to your school."
Post a Comment