Y.S.R KANTIVELUGU
- 10న వైఎస్సార్ కంటి వెలుగు
- రూ . 500 కోట్లతో పథకం అమలు .
- తొలిరోజే 70 లక్షల మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు .
- 6 దశల్లో శస్త్ర చికిత్సలు .
- ఉచితంగా ఆపరేషన్లు , మందులు , కళ్ళజోళ్లు
రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా అనేక కీలక కార్యక్ర మాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది . అతి ముఖ్య శాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ముఖ్య మంత్రి జగన్ నడుం బిగించారు . వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణ లపై సుజాతారావు కమిటీని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది . ఇప్పటికే ఆ కమిటీ పలు సిఫార్సులు , మార్పులకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు అందజేసింది . ఈ దశలోనే ఆయన తెలంగాణలో సక్సెస్ అయిన కంటివెలుగు పథకాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు . ఈ నెల 10వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు
వైఎస్సార్ కంటి వెలుగు పేరిట ప్రారంభించనున్న ఈ పథకానికి రూ . 500 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది . రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు ఉచితంగాకంటివైద్యపరీక్షలు నిర్వహించడమేకాకుండా ఆధునిక వైద్య సేవలు అందించనున్నారు . ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ ) ఆళ్ల నాని ఇప్పటికే నేత్ర వైద్య ని పుణులతో భేటీ అయి వారి సాకారాన్ని కోరారు . నేత్ర వైద్యులు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న నిర్దిషహామీని ఇచ్చారు . | అక్టోబరు 10న 70 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లో కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు . దీనికి అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రారంభిం చింది . అక్టోబరు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కంటివైద్య పరీక్షలు నిర్వహించిఆతరువాత ఆరుదశల్లోకంటిచూపు లోపంతో పాటు ఇతర శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఆధునిక వైద్యాన్ని అందించనున్నారు . ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించడంతో పాటు మందులు , కళ్ళజోళ్లు ప్రభుత్వం అందిస్తుంది . ఇప్పటికే దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది . తెలంగాణలో ఎంతో విజయవంతమైన ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంతో పేదలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది . తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు . ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు . దీంతో అధికార యంత్రాంగం ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమైంది .
0 Response to "Y.S.R KANTIVELUGU"
Post a Comment