Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

English Medium one to 6th grade from next academic year

  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వరకు ఇంగ్లీషు మీడియం
  • రేపు మనబడి నాడు - నేడు
  • అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషుల్యాబ్స్
  • జనవరి 1 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
  • డిసెంబర్‌లోగా పాఠ్యప్రణాళిక సిద్ధంచేయాలి : సీఎం.జగన్
English Medium one to 6th grade from next academic year

  • వచ్చే విద్య సంవత్సరం నుంచి ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు . - తరువాత ఒక్కో ఏడాది మిగిలిన తరగతుల్లో ఇంగ్లీష్ విద్యాబోధన ప్రారంభం కావాలని స్పష్టం చేశారు . మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయం లో వివరాలు అధికారులతో  సమీక్షించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 14వ రాష్ట్ర వ్యాప్తంగా మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు . మొదటి దశలో 15 వేలకు పైగా పాఠశాలల లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు . ఒకటి నుంచి ఆరు తరగతులు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టిన అనంతరం తదుపరి తరగతుల్లో ఇంగ్లీషు విద్యాబోధన చేపట్టడం వల్ల ప్రతి విద్యార్థికి నాలుగేళ్ళ సమయం ఉంటుందని దీంతో వారికి ఇంగ్లీష్ పై చక్కని పట్టు లభించే అవకాశం ఉందన్నారు . 


అయితే తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా బోధించాలని స్పష్టం చేశారు . ఇది అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని ప్రతి విద్యార్థి సీబీఎస్సీ ,ఐసీఎస్యూ పరీక్షలు రాసే స్థాయికి ఎదిగేదా అత్యంత నాణ్యత ప్రమాణాలతో బోధనలు జరగాలని ఆదేశించారు . కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు . అదేవిధంగా బోధనకు సంబంధించి జనవరి 1 నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు . డిసెంబరులో , పాఠ్య ప్రణాళికను ఖరారు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు . ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని తాయిలెట్ల ఫ్యాన్ లైట్లు , తాగునీరు , ఫర్నీచర్ , పెయింటింగ్ పనులు , మరమ్మత్తులు , గ్రీన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు . ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు , ప్రహారీ గోడల నిర్మాణం జరగాలని ఆదేశించారు . పాఠశాలల అభివృద్ధిలో పాఠశాల విద్యకమిటి ని భాగస్వామ్యం చేసి వ్యవస్ట లో సమూల మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు . నాడు నేడు పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో తాను ఈ నెల ప్రారంభించనున్నట్లు తెస్తారు . తొలి విడతలో పాఠశాలల అభివృద్ధి మరమ్మత్తుల నిమిత్తం రూ . 3 . 500 కోట్లను వెచ్చించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు . ఇంత పెద్ద ఎత్తున నిధులు గతంలో ఎన్నడూ ఖర్చు చేయలేదని ప్రతి జిల్లాలో మూడింట ఒక వంతు పాఠశాలలను తొలి విడతలోనే అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు . మంత్రులు , ఎమ్మెల్యేలు , పాఠశాలలు అభివృద్దలో భాగస్వాములు కావాలని ఆదేశించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "English Medium one to 6th grade from next academic year"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0