Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Plans on Census

ఇక ఎన్పీ ఆర్ ! 
 జనాభా లెక్కల గణనపై ప్రణాళికలు 
రేపు మరో సారి కేబినెట్ భేటీ 
2020 , ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు లెక్కింపు 
 జనాభా లెక్కల గణనపై ప్రణాళికలు

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై అమలు విషయంలో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు . దీనికితోడు జనాభా లెక్కల గణనపై ( ఎన్ పీఆర్ ) దృష్టిసారించినట్టు తెలుస్తోంది . మంగళవారం కేంద్ర కేబినెట్ మరోసారి భేటీ కానుంది . ఈ సమావేశంలో జనాభా లెక్కలగణనపై కీలక నిర్ణయం తీసుకునే అవ కాశం కనిపిస్తోంది . సీఏఏ అమలు తరువాత ఎస్ఆర్ సీ అమలు సాధ్యాసాధ్యాలపై కూడా శనివారం జరిగిన మంత్రివర్గం భేటీలో మోడీ చర్చించినట్టు సమాచారం . సీఏఏ , ఎస్ఆర్ సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఎన్‌పీఆర్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది . ఎన్‌పీఆర్ ప్రకారం . . దేశ వ్యాప్తంగా ప్రతీ ఇంటికెళ్లి సభ్యులను లెక్కించనుంది . ఏప్రిల్ 1 , 2020 నుంచి సెప్టెంబర్ 30 , 2020 వరకు ఈ జనాభా లెక్కల గణన కొనసాగనుంది . దేశంలోని కామన్ రెసిడెంట్ ను గుర్తించి డేటా బేసన్ను తయారు చేయడమే ఎస్పీఆర్ లక్ష్యంగా ఉండనుంది . మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్‌పీఆర్ చొరవతో 2010లో ఇది ప్రారంభమైంది . ఆరునెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే ఏ నివాసి అయినా ఎస్పీఆర్ లో తన పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Plans on Census"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0