Plans on Census
ఇక ఎన్పీ ఆర్ !
జనాభా లెక్కల గణనపై ప్రణాళికలు
రేపు మరో సారి కేబినెట్ భేటీ
2020 , ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు లెక్కింపు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై అమలు విషయంలో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు . దీనికితోడు జనాభా లెక్కల గణనపై ( ఎన్ పీఆర్ ) దృష్టిసారించినట్టు తెలుస్తోంది . మంగళవారం కేంద్ర కేబినెట్ మరోసారి భేటీ కానుంది . ఈ సమావేశంలో జనాభా లెక్కలగణనపై కీలక నిర్ణయం తీసుకునే అవ కాశం కనిపిస్తోంది . సీఏఏ అమలు తరువాత ఎస్ఆర్ సీ అమలు సాధ్యాసాధ్యాలపై కూడా శనివారం జరిగిన మంత్రివర్గం భేటీలో మోడీ చర్చించినట్టు సమాచారం . సీఏఏ , ఎస్ఆర్ సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఎన్పీఆర్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది . ఎన్పీఆర్ ప్రకారం . . దేశ వ్యాప్తంగా ప్రతీ ఇంటికెళ్లి సభ్యులను లెక్కించనుంది . ఏప్రిల్ 1 , 2020 నుంచి సెప్టెంబర్ 30 , 2020 వరకు ఈ జనాభా లెక్కల గణన కొనసాగనుంది . దేశంలోని కామన్ రెసిడెంట్ ను గుర్తించి డేటా బేసన్ను తయారు చేయడమే ఎస్పీఆర్ లక్ష్యంగా ఉండనుంది . మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్పీఆర్ చొరవతో 2010లో ఇది ప్రారంభమైంది . ఆరునెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే ఏ నివాసి అయినా ఎస్పీఆర్ లో తన పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది .
0 Response to "Plans on Census"
Post a Comment