Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Welcome to ideal education

  • ఆదర్శ విద్యకు ఆహ్వానం..
  • ఫిబ్రవరి 7 వరకూ దరఖాస్తుల శ్వీకరణ..
  • ఏప్రిల్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహణ..
  • అర్హతలు-రిజర్వేషన్లు..
  • దరఖాస్తు విధానం ఇలా..
Welcome to ideal education


 ఆంగ్ల మాధ్యమంలో చదువుకో వాలనుకునే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా మారాయి . జిల్లా వ్యాప్తంగా 16 పాఠశాలలు ఉన్నాయి . ప్రతీ సం వత్సరం 16 వందల మంది విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు . ఏటా ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలోను వంద మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు . ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా చదువుకోవచ్చు . కంప్యూటర్ ల్యాబ్స్ , సైన్స్ ల్యాబ్స్ , డిజటల్ క్లాస్ రూమ్స్ , అత్యుత్తమ గ్రంథాలయాలు , మరెన్నో సౌకర్యాలతో కూడిన ప్రత్యేక శిక్షణను పొందవచ్చు .

 అర్హతలు ఇవీ . . .

 2018 - 19 , 2019 - 20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5 తరగతులు చదివిన వారై ఉండాలి . ఓసీ , బీసీ లకు చెందిన వారు 01 - 09 - 2008 నుంచి 31 - 08 - 2010 మధ్య , ఎస్సీ , ఎస్టీ విద్యార్థులైతే 01 - 09 - 2008 నుంచి 31 - 08 - 2010 మధ్య - జన్మించి ఉండాలి . 

దరఖాస్తు ఇలా . . . 

విద్యార్థులు ఏపీ ఆన్లైన్ లేదా మీ సేవా కేం ద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలి . ఓసీ , బీసీ విద్యార్థులు రూ . 100 , ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు రూ . 50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది . దరఖాస్తుతో పాటు ఆధార్ , కులం , ఆదాయం , రేషన్‌కార్డు , ఒక పాస్ఫోటో , విద్యార్హత సరి ఫికెట్ , తదితర పత్రాలను ఆయా మండల కేం ద్రాల్లో గల ఆదర్శపాఠశాలల్లో ఫిబ్రవరి 1వ తేదీలోగా అందజేయాలి .

 రిజర్వేషన్ల తీరు . . 

15 శాతం ఎస్సీలకు , 6 శాతం ఎస్టీలకు , 29 శాతం బీసీలకు ( 7శాతం బీసీ ఏ , 10 శాతం బీసీ - బి , బీసీ - సిలకు ఒక్క శాతం , బీసీ - డీలకు 7శాతం , బీసీ - ఈలకు 4శాతం ) కేటాయింపులు ఉంటాయి . దివ్యాంగులకు 3శాతం , బాలికలకు 33 . 33శాతం సీట్లను కేటాయించారు . నిర్దేశిం చిన విభాగాల్లో అభ్యర్థులు లేకపోతే ఇతర గ్రూపుల నుంచి భర్తీ చేస్తారు . 50 శాతం సీట్లు ఇతర కులాలకు నిర్దేశించారు . 

ఏప్రిల్ 5న రాత పరీక్ష . . .

 దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఆయా మండల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు . తెలుగు , ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు . 5వ తరగతి సామర్థ్యానికి అనుగుణంగా తెలుగు , గణితం , పరిసరాల విజ్ఞానం , ఆంగ్ల నైపుణ్యంపై 25 మార్కుల చొప్పున ఐచ్చిక పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి . ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు . ఓసీ , బీసీలకు కనీస అర్హత మార్కులు 50 , ఎస్టీ , ఎస్సీ విద్యార్థులకు 35 మార్కులు తప్పక సాధించాలి . 

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి 

 పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించే దిశగా ప్రభుత్వం ఆదర్శపాఠ శాలలను ప్రభుత్వం నెలకొల్పింది . ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశం చక్కని అవకాశంగా విద్యార్థుల తల్లి దండ్రులు భావిస్తున్నారు . నూతన భవనాలు , విశాలమైన తరగతి గదులు , ఎన్నో మెరుగైన సౌకర్యాలు కల్పించ డంతో ఈ పాఠశాలలకు ఆదరణ పెరిగింది . 

- ఎన్ . అనిత , 
ఆదర్శపాఠశాల ఇన్ చార్జ్ ప్రిన్సిపాల్ ,
 ఎల్ . కోట మండలం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Welcome to ideal education"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0