Don't believe the rumors on tenth class exams
పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :: పత్రికా ప్రకటన తేదీ: 05.5.2020పదో తరగతి పరీక్షలపైవదంతులు నమ్మవద్దు
పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు
కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రస్తుతానికి వాయిదా వేసిన సంగతి విధితమే. కొంతమంది ఈ నెల 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటూ అనధికార టైమ్ టేబులును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వదంతులు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వదంతుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వదంతులు పుట్టించినవారిపై, షేర్ చేసినవారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందవద్దని విద్యాశాఖ కమీషనర్ స్పష్టం చేశారు.
0 Response to "Don't believe the rumors on tenth class exams"
Post a Comment