Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Risk of dropouts with online classes

ఆన్ లైన్ తరగతులతో డ్రాపౌట్స్ ప్రమాదం
ఏపీఎస్ఈఆర్ఎంసీ చైర్మన్ కాంతారావు గారు సూచన.
Risk of dropouts with online classes

కరోనా వైరస్ (కొవిడ్ - 19) నేపథ్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణ వల్ల డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీఎస్ఈఆర్ఎంసీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ట్యాబ్లు, మొబైల్స్ కే ఆన్లైన్ విద్యను పరిమితం చేయకుండా భౌతిక అభ్యాసనం చేయించాల్సిన అవశ్యం ఉందని అభిప్రాయపడింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించాల్సి వస్తే జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది
కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు అధ్యక్షతన పాఠశాల విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జరిగింది. ఆన్లైన్ తరగతులపై కమిషన్ సభ్యులు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పాఠశాల, కళాశాలలు ప్రారంభిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్లైన్ తరగతులతో తలెత్తే ఇబ్బందులపై చర్చించారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సి వస్తే ఐదో తరగతిలోపు విద్యార్థులకు రద్దు చేస్తేనే మంచిదని అభిప్రాయ పడ్డారు. ఒకవేళ నిర్వహించాలనుకుంటే తక్కువ సమాయాన్ని కేటాయిం చాలన్నారు. దీని వల్ల డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని సభ్యులు హెచ్చరించారు. ఆన్లైన్ విద్యలో భాగంగా భౌతిక అభ్యాసనతోపాటు అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, ఇంట్లో లభించే వస్తువులతో ప్రయోగాలు వంటివి చేయించాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ లేబోరేటరీలను ఏర్పాటు చేయాలన్నారు. ఆన్లైన్ క్లాసుల సమయంలో తల్లిదండ్రులలో ఎవరో ఒకరు విధిగా పిల్లల దగ్గర ఉండాలని, ఇందుకోసం తొలుత పేరెంట్స్ లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణకు పెద్ద స్కూల్స్, కాలేజీలకు తగినంత వనరులు ఉన్నప్పటికీ చాలామంది విద్యార్థులకు అలాంటి అవకాశం లభించకపోవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అందుబాటులో ఉండే వనరుల గురించి ఆలోచన చేయాలన్నారు
ఒకవేళ స్కూల్ ప్రారంభించాల్సి వస్తే పలు జాగ్రత్తలు చేపట్టాలని చైర్మన్ కాంతారావు సూచించారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించాలని, షిఫ్ట్ విధానం, సిలబస్ కుదింపు, ఓపెన్ ఎయిర్ తరగతులు వంటి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సబ్జెక్టు నైపుణ్యాలు, ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. కోవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస్ ఆరోగ్య విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సమావేశంలో కమిషన్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ విజయ్ శారద రెడ్డి, కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Risk of dropouts with online classes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0