.Many key decisions in the AP cabinet meeting today
నేడు AP కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు
వైఎస్సార్ ఆసరాకు నేడు గ్రీన్ సిగ్నల్!
సెప్టెంబర్ 5 నుంచి జగనన్న అమలుపై నిర్ణయం
వైఎస్సార్ బీమా పథకంపైనా చర్చించి నిర్ణయం
డిసెంబర్ నుంచి నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ
వైఎస్సార్ ఆసరాకు నేడు గ్రీన్ సిగ్నల్!
సెప్టెంబర్ 5 నుంచి జగనన్న అమలుపై నిర్ణయం
వైఎస్సార్ బీమా పథకంపైనా చర్చించి నిర్ణయం
డిసెంబర్ నుంచి నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ
- మరో కీలకమైన ఎన్నికల హామీ అమలుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధ
- వారం ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్ లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక
- నిర్ణయాలు తీసుకోనున్నారు.
- పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట
- ప్రకారం 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న అప్పును నాలుగు విడతల్లో చెల్లించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ ఆసరా పథకం అమలుకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
- దీని ద్వారా పొదుపు సంఘాల్లోని 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలగనుంది.
- వైఎస్సార్ బీమా అమలుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
- అలాగే డిసెంబర్ నెల నుంచి బియ్యం కార్డు కలిగిన వారందరికీ నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయడంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
- ఇప్పటికే ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదముద్ర వేయడంతో పాటు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
- బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు, ఫ్యాక్టరీల చట్టంలో సవరణలు, సెప్టెంబర్ 5 నుంచి జగనన్న విద్యాకానుక అమలు తదితర అంశాలపైసమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
0 Response to ".Many key decisions in the AP cabinet meeting today"
Post a Comment