Sweet News for students in AP .... 1st to 8th graders have no exams next year
ఏపీ లో విద్యార్థులకు తీపి కబురు.... 1నుండి 8వ తరగతుల వారికి వచ్చే ఏడాది పరీక్షలు లేవు.
- ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
- అంటే, వాస్తవ షెడ్యూల్ కంటే మూడు నెలలు ఆలస్యంగా క్లాసులు ప్రారంభం కానున్నాయి.
- ఈ క్రమంలో విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- సుమారు 30 శాతం నుంచి 40 శాతం మేర సిలబస్ తగ్గించే అవకాశం ఉంది.
- విద్యా సంవత్సరం ఎంత మిగిలి ఉంది? ఎన్ని రోజులు స్కూళ్లు జరుగుతాయి?, ఏ విధంగా విద్యా విధానం ఉంటుందనే అంశాన్ని బట్టి ఎంతమేర సిలబస్ తగ్గించాలనేది నిర్ణయిస్తారు.
- 'మనకు ఒక విద్యాసంవత్సరంలో 222 రోజులుంటే, అందులో 90 రోజులు ఇప్పటికీ నష్టపోయాం.' అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
- అయితే, పరీక్షల విధానంలో కానీ, ప్రశ్నాపత్రం విధానంలో కానీ మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.
- సిలబసకు సంబంధించిన వర్క్ బుక్ను ప్రభుత్వ పాఠశాలలకు అందించాం.
- విద్యార్థుల కోసం విద్యా వారధి వాహనాలు కూడా ఏర్పాటు చేశాం.
- అయితే, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆన్ లైన్ క్లాసులు జరగడం లేదు.
- దీన్ని బట్టి ఒక ఏడాది సిలబస్ ఆరు నెలల్లో పూర్తి చేయడం అంటే అటు విద్యార్థులకు, ఇటు టీచర్లకు కూడా కష్టమే.
- కాబట్టి సిలబస్ తగ్గించాలని నిర్ణయించాం.' అని ఆదిమూలపు సురేష్ గారు అన్నారు.
- అయితే, సిలబస్లో దేన్ని దేన్ని తీసేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.
- SCERT అధికారులు దీనిపై సమగ్రంగా చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
- స్కూళ్లు రీ ఓపెన్ అయిన తర్వాత దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.
- ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు ఉండవని, ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా వారిని ప్రమోట్ చేస్తామని చెప్పారు.
- అయితే, 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం పరీక్షలు ఉంటాయి.
- స్కూళ్లలో ఎలాంటి విధానాలు పాటించాలనే దానిపై ప్రభుత్వం ఒక పద్ధతి సూచిస్తుంది.
- ప్రతి 15 రోజులకు ఓసారి స్కూళ్లు తమ విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించి, వారి హెల్ట్ రికార్డులు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
- అలాగే, ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాల్సి ఉంటుంది.
- ఆ రోజు క్రీడా, వినోద, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలు చేపట్టాలి.
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి బదులు బియ్యం ఇస్తారు.
- స్కూళ్లలో ఉదయం పూట నిర్వహించే 'అసెంబ్లీని ఇకపై విద్యార్థులు తమ తమ క్లాసుల్లోనే నిర్వహిస్తారు.®️
0 Response to "Sweet News for students in AP .... 1st to 8th graders have no exams next year"
Post a Comment