Jagananna Ammavadi
అమ్మ ఒడి ఆంక్షల సుడి
దీంతో చాలామంది అనర్హుల జాబితాలో చేరుతున్నారు. 11 రకాల వివరాల్ని పరిశీలించి అనర్హుల్ని గుర్తించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
- గడచిన ఏడాది అమ్మఒడి లబ్ధికి రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ కార్డుల స్థానంలో బియ్యం కార్డులు పంపిణీ చేశారు. వాటిలో ఆదాయం వివరాలు పొందుపర్చకపోవడం సమస్యగా మారింది. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేలకు మించి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలకు మించి ఆదాయం ఉంటే అనర్హుల్ని చేస్తున్నారు.
- గతేడాది ఆర్టీసీ ఉద్యోగులు కార్పోరేషన్లో ఉండటంతో వారి పిల్లలకు అమ్మఒడి వర్తింపజేశారు. ఈసారి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి అనర్హులు చేశారు.
- కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలకు అమ్మఒడి తొలివిడత లబ్ధి అందింది. వారితో కార్పోరేషన్ ఏర్పాటుచేసి వేతనాలు సీఎంఎఫ్ఎస్ పద్ధతిలో ఇస్తున్నారు. దీంతో వారికి కూడా లబ్ధి హుళక్కే అయ్యింది.
- సచివాలయ ఉద్యోగి కుటుంబంలో ఉన్నా తొలివిడతలో మానవతా ధృక్పథంతో లబ్ధి అందించారు. ఈసారి నిర్దాక్షిణ్యంగా సచివాలయ ఉద్యోగం ఉంటే ఆ కుటుంబంలోని పిల్లలకు అమ్మఒడి లబ్దిని తీసేస్తున్నారు.
- జనవరి నుంచి నవంబరు వరకు ఎన్నో బ్యాంకుల విలీనం జరిగింది. పాత బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్ కాకుండా కొత్త బ్యాంకు కోడ్ఇస్తేనే లబ్ధి అందుతుంది. దీనిపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి.
- కుటుంబంలో ఇప్పటికే ఒక పిల్లాడికి అమ్మఒడి లబ్ది అందుతుంటే రెండో అబ్బాయికి కూడా లబ్ధి అందాలనే ఆలోచనతో గార్డియన్ను తెలివిగా కొందరు చేర్చారు. ఇలాంటి వాటికి ఆధార్ మిస్మ్యాచ్ అని వస్తుంది. దీంతో మొదటి పిల్లాడికి కూడా లబ్ది అందని పరిస్థితి ఉంది.
- విద్యార్థి, తల్లి పేర్లలో తప్పులు దొర్లాయి. అమ్మాయిచోట అబ్బాయి.. అబ్బాయికి బదులు అమ్మాయి అసలు పిల్లాడి పేరే లేకుండా కేవలలం ఇంటిపేరు మాత్రమే ఉంది.సరిచేయడానికి అవకాశం ఇవ్వలేదు.
0 Response to "Jagananna Ammavadi"
Post a Comment