Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Suicide of a couple

 దంపతుల ఆత్మహత్య 

Suicide of a couple


  • ఫీజులు వసూలుకాక 
  • అప్పులు చెల్లించలేక

 కోవెలకుంట్ల , న్యూస్టుడే : పాఠశాల స్థాపించినా .. ఫీజులు వసూలు కాకపోవడం .. అప్పులు చేసి పెట్టుబ డులు పెట్టినా .. కరోనా ప్రభావంతో బడి మూతపడడం , అప్పులిచ్చిన వారంతా ఒత్తిడి తేవడం వంటి కారణా లతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది . స్థానికుల వివరాల మేరకు . . కోవెలకుంట్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం (33) , కోడలు రోహిణి (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు . భార్యాభర్తలిద్దరూ గత నాలుగేళ్లుగా పట్టణంలో లైఫ్ ఎనర్జీ స్కూల్ నిర్వహిస్తున్నారు . ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మండలం కరివెన సమీపంలో కారులో సుబ్ర హ్మణ్యం , రోహిణి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసు కున్నారు . ఆత్మహత్యకు ముందు చరవాణిలో సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్ లోడ్ చేయ డంతో విషయం వెలుగుచూసింది . ' ఈ రోజు నేనూ . . నా భార్య చనిపోతున్నాం . అందరూ క్షమించాలి . విద్యా ర్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి . మాకు ఫీజులు రాక , అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం  భరించలేక ఇలా చేసుకోవాల్సి వస్తోంది . " అంటూ వారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోలో వెల్లడించడం సంచలనం కలిగించింది. విషయం తెలిసి జనం వారి ఇంటి వద్దకు చేరారు . సుబ్రహ్మణ్యం భార్య రోహిణి స్వగ్రామం ఆత్మకూరు . వారు ఆత్మకూరు నుంచి కోవెలకుంట్లకు వస్తూ మార్గమధ్యంలో విష గుళికలు మింగారు . విషయం తెలుసుకున్న బంధు వులు స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే భర్త మృతి చెందారు . రోహిణిని కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు . స్కూల్ కోసం సుమారు రూ .2 కోట్ల వరకు అప్పుచేసి ఉంటారని స్థానికులు తెలి పారు . ఇద్దరి మృతితో వారి కుటుంబీకులు రోదించడం అందరినీ కలచివేసింది .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Suicide of a couple"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0