Suicide of a couple
దంపతుల ఆత్మహత్య
- ఫీజులు వసూలుకాక
- అప్పులు చెల్లించలేక
కోవెలకుంట్ల , న్యూస్టుడే : పాఠశాల స్థాపించినా .. ఫీజులు వసూలు కాకపోవడం .. అప్పులు చేసి పెట్టుబ డులు పెట్టినా .. కరోనా ప్రభావంతో బడి మూతపడడం , అప్పులిచ్చిన వారంతా ఒత్తిడి తేవడం వంటి కారణా లతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది . స్థానికుల వివరాల మేరకు . . కోవెలకుంట్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం (33) , కోడలు రోహిణి (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు . భార్యాభర్తలిద్దరూ గత నాలుగేళ్లుగా పట్టణంలో లైఫ్ ఎనర్జీ స్కూల్ నిర్వహిస్తున్నారు . ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మండలం కరివెన సమీపంలో కారులో సుబ్ర హ్మణ్యం , రోహిణి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసు కున్నారు . ఆత్మహత్యకు ముందు చరవాణిలో సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్ లోడ్ చేయ డంతో విషయం వెలుగుచూసింది . ' ఈ రోజు నేనూ . . నా భార్య చనిపోతున్నాం . అందరూ క్షమించాలి . విద్యా ర్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి . మాకు ఫీజులు రాక , అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఇలా చేసుకోవాల్సి వస్తోంది . " అంటూ వారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోలో వెల్లడించడం సంచలనం కలిగించింది. విషయం తెలిసి జనం వారి ఇంటి వద్దకు చేరారు . సుబ్రహ్మణ్యం భార్య రోహిణి స్వగ్రామం ఆత్మకూరు . వారు ఆత్మకూరు నుంచి కోవెలకుంట్లకు వస్తూ మార్గమధ్యంలో విష గుళికలు మింగారు . విషయం తెలుసుకున్న బంధు వులు స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే భర్త మృతి చెందారు . రోహిణిని కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు . స్కూల్ కోసం సుమారు రూ .2 కోట్ల వరకు అప్పుచేసి ఉంటారని స్థానికులు తెలి పారు . ఇద్దరి మృతితో వారి కుటుంబీకులు రోదించడం అందరినీ కలచివేసింది .
0 Response to "Suicide of a couple"
Post a Comment