No Weightage for AP EAPCET 2022
ఏపీ విద్యార్ధులకు అలర్ట్ ! AP EAPCET 2022 లో ఇంటర్ వెయిటేజీ రద్దు .. ర్యాంకుల కేటాయింపు
No Weightage for AP EAPCET 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్ 2022కు సంబంధించి మంగళవారం (మే 17) కీలక ప్రకటన విడుదల చేసింది.
కాగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడానికి ఏపీ ఈఏపీసెట్ 2022 నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు కొనసాగింది. ఇక ఏపీ ఈఏపీసెట్ రాత పరీక్ష జూలై 4 నుంచి 8 వరకు మొత్తం 5 రోజుల పాటు, మొత్తం 10 సెషన్లలో ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జులై 11, 12 తేదీల్లో 4 సెషన్లలో జరగనున్నాయి. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎగ్జాం ప్యాట్రన్, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్, బీటెక్ (బయోటెక్), బీటెక్ (డైరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
0 Response to "No Weightage for AP EAPCET 2022"
Post a Comment