Increase in interest rates on savings schemes will come into effect from tomorrow
పొదుపు పథకాలపై వడ్డీరేట్ల పెంపు.. రేపటి నుంచి అమల్లోకి
Govt Hikes Interest Rates: పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు, ఎన్ఎస్సీ, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లతో సహా చిన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది.
ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం.
జాతీయ పొదుపు పత్రం (ఎన్ఎస్సీ) పథకానికి ప్రస్తుతం ఉన్న 6.8 శాతం వడ్డీరేటును 7శాతానికి, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కు 7.6 శాతం ఉన్న వడ్డీ రేటును 8శాతానికి పెంచింది.
1 నుంచి 5ఏళ్ల కాల పరిమితితో ఉండే పోస్టాఫీస్ టెర్మ్ డిపాజిట్ స్కీమ్లకు వడ్డీ రేట్లు 1.1 బేస్ పాయింట్ల వరకు పెరిగాయి.
ఒక సంవత్సరం టెర్మ్ డిపాజిట్లకు 6.6 శాతం
రెండు సంవత్సరాల టెర్మ్ డిపాజిటర్లకు 6.8శాతం
మూడు సంవత్సరాల టర్మ్ డిపాజిట్లకు 6.9శాతం
ఐదు సంవత్సరాల టెర్మ్ డిపాజిట్లకు 7.0 శాతం వడ్డీ రేటు అమల్లోకి రానున్నాయి.
నెలవారీ ఆదాయ పథకానికి వడ్డీరేటు ప్రస్తుతం ఉన్న 6.7 నుంచి 7.1 శాతానికి పెరిగింది.
కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించి వడ్డీ రేటును 7.0 నుంచి 7.2కు పెంచి, మెచ్యురిటీ సమయాన్ని 123 నుంచి 120 నెలలకు ప్రభుత్వం తగ్గించింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన పథకాల ప్రస్తుత వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదు.
0 Response to "Increase in interest rates on savings schemes will come into effect from tomorrow"
Post a Comment