New rules from April 1
ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు.
మనదేశానికి సంబంధించినంత వరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకాబోతోంది. మార్చి 31వ తేదీతో మనం పూర్తిచేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి.
పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. ఇలాంటి ఆర్థిక మార్పులు చాలావున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
పాన్-ఆధార్ కార్డు లింక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఆదేశాల ప్రకారం మార్చి 31వ తేదీనాటికి పాన్-ఆధార్ లింక్ చేయాలి. ఈ రెండు లింక్ చేయకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. ఈసారి యాక్టివేట్ చేయించుకునేటప్పుడు రూ.10వేల జరిమానా చెల్లించాలి.
కార్ల ధరల పెంపు స్టేజ్-2 అమలుతో కార్ల ధరలు పెరగబోతున్నాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎమ్డబ్ల్యూ, టయోటా, ఆడి, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ కంపెనీలకు చెందిన వాహనాల ధర పెరగనుంది. ఈ కంపెనీలన్నీ తమ కొత్త ధరను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. కారు మోడల్ ను బట్టి ఒక్కో కంపెనీ రూ.50వేల వరకు పెంచుతోంది.
మన దేశంలో బంగారం అమ్మకానికి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 6 అంకెల HUID నెంబర్ రిజిస్టర్ చేసిన ఆభరణాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. కొత్త బంగారం కొనుగోలు చేయాలంటే హాల్ మార్క్ కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రజలు తమ పాత ఆభరణాలను హాల్ మార్క్ లేకుండా విక్రయించుకోవచ్చు.
రూ.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ప్రీమియం పాలసీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది వర్తిస్తుంది. పాలసీ ద్వారా వచ్చే ఆదాయంపై ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి డీమ్యాట్ ఖాతాదారులు నామినీ పేరు దాఖలు చేయాల్సి ఉంటుంది. అది చేయకపోతే ఖాతా నిలిచిపోతుంది. సెబీ సర్క్యులర్ ప్రకారం.. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలో నామినీని కచ్చితంగా యాడ్ చేయాలి.
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ నామినేషన్ను మార్చి 31లోపు పూర్తి చేయాలి. ఆలోగా పూర్తిచేయలేకపోతే ఏప్రిల్ 1వ నుంచి సంబంధిత పోర్ట్ఫోలియో స్తంభింపజేయనుంది. వివరాలను పూర్తిగా సమర్పించిన తర్వాత మాత్రమే అది మళ్లీ ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ నెలలో వివిధ పండుగలు, ఇతర కారణాలవల్ల దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.
0 Response to "New rules from April 1"
Post a Comment